Thursday, November 24, 2011

సత్యం..ఒక మరపురాని జ్ఞాపకం...


ఏం శరత్ ఎలా ఉన్నావు... చిరపరిచయమైన పిలుపు. స్నేహం నిండిన ఆ కళ్ళు, స్వచ్చమైన   నగు మోము. సత్యానికివే చిరునామాలు. ప్రతీసారి నా ఒంగోలు యాత్రలో ఎదురై పలకరించే అతికొద్ది మంది మిత్రుల్లో తను ఒకడు. 
మా పరిచయం ౬-౭ ఏళ్లది. అది సంధి కాలం.నేను IT లో ఉద్యోగం కోసం తెగ ప్రయత్నిస్తున్న రోజులు. హైదరాబాద్ లో ఏదో ఉద్యోగం వెలగ పెడుతూ, పూర్తి ప్రయత్నం దీని మీద చేసేవాడిని. ప్రతి నెలలో ఒక్కసారైనా వూరికి రావటం. అందరిని కలవటం చేసే వాడిని. వచ్చిన ప్రతి సారి కరెంట్ ఆఫీసు ( మా నాన్నగారు అందులో నే పని చేసేవారు) కి వెళ్ళటం, పొద్దునా సాయంత్రం అక్కడ మిత్రులతో బాతాఖాని, కుదిరితే, సాయం కాలాలు షటిల్ ఆడుకోవటం. వెళ్ళిన ప్రతిసారి సత్యం కలిసేవాడు. తను చిన్న చిన్న ఎలెక్ట్రిక్ పనులు చేస్తూ అదే ఆఫీసు లో టెంపరరీ గా పని చేసేవాడు. 
మాలా వూర్లేమ్మట పడి ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన అవసరం లేని స్తితిమంతులు వాళ్ళు. నిజం చెప్పాలంటే తనకు ఆ ఉద్యోగ అవసరం యెంత మాత్రము లేదు. కాని తన కంటూ ఒక పని, గుర్తింపు ఉండాలనే సత్తె కాలపు మనిషి. డిగ్నిటీ అఫ్ లేబర్ గురుంచి తెలుసుకోవాలంటే, సత్యాన్నే అడగాలి.ఆఫీసు లో ఈ పని ఆ పని అని కాకుండా అన్ని పనులు తనవే అన్నట్టు ఉంటాడు. ఇంట్లో పెళ్ళికొచ్చిన ౩  గ్గ్గురు  అక్క చెల్లెళ్ళ భాద్యత, వయసుడిగిన పెద్దవాళ్ళు ,వీళ్ళందరిని వదిలి ఎక్కదికేల్తాంలే బాబాయ్ అని ఒకటి రెండు సార్లు అన్న గుర్తు.
అదే కాలం లో మా పరిచయం పెరిగింది. నెలల కొద్దీ సాగుతున్న ఉద్యోగ ప్రయత్నాల గురుంచి నేను కొద్దిగా నిరాస గా మాట్లాడినా, అదే వస్తాదిలే శరత్ కొంచెం ఓపిక పట్టు. నువ్వు మాత్రం వదలక ప్రయత్నించు అనే వాడు. మిగతావాళ్ళతో కలిసి నా ధైర్యం పెంచే ప్రయత్నం చేసేవాడు. మాకేలాగు కుదరదు ఇల్లాంటి జాబ్స్ ట్రై చేయటానికి, వయసు, అవకాశం ఉన్న మీలాంటి వాళ్ళు ట్రై చెయ్యక పొతే ఎలా...
నిజమే. త్వరలోనే నాకు జాబు వచ్చింది. అలాగే నేను ఒంగోలు రావటం పోవటం తగ్గాయి.నేను చెయ్యకపోయినా వచ్చినపుడల్లా, నా బాగోగుల గురించి ఇంట్లో వాకబు చేసేవాడు.నేనేదో సాధించేసాను అన్న భావం తనతో మాట్లాడిన ప్రతి సారీ నాకు కలిగేది. జీవితం లో కష్టపడి పైకి వచ్చావ్ అబ్బాయి...సామాన్యంగా ఇంట్రోవేర్ట్ అయిన సత్యం నుంచి వచ్చిన నేనెప్పుడు తలుచుకునే కామ్ప్లిమెంట్లు. 
అల్లాంటి సత్యం నేడు లేడు అని అమ్మ ఫోన్ చేసినప్పుడు నమ్మ బుద్ది కాలేదు.  నిజంగా పొద్దున్నే నిద్రలో నేను కలవరిస్తున్నానేమో..ఇదంతా కలేనేమో...
లేదురా...కరెంట్ పని చేస్తూ షాక్ కొట్టి..అమ్మ ఇంకా మాట్లాడలేదు...తన నవ్వు మొహం నా ఊహల్ని కప్పేసింది. ఏం ఎందుకని ఏం తప్పు చేసాడు తను...నేనేరుగగా..ఎవరిని పల్లెత్తు మాట అనలేదు..ఎవరి గురుంచి తప్పు మాట్లాడలేదు...నిజంగా దేవుడనే వాడు ఒకడు ఉండి, తనే జన్మ మరణాలకు కారణం అయితే, ఆయన చాలా తప్పు చేసాడు. తన ఇద్దరు చిన్నారుల మొహం చూసి అయినా ఆ పాపిష్టి దేవునికి దయ రాలేదా...నాన్న యేడి అని వాళ్ళు అడిగితె, అయన ఏమి సమాధానం చెప్తాడు..ఇంకా నూరేళ్ళ జీవితం ముందుంది కదా...అప్పుడే ఎందుకిలా..
తన మరణం నాకింకా నమ్మ శక్యం కాదు...నా లాజిక్ కి అందదు...కాని ఒకటి మాత్రం నిజం.దేవుడు చాల చిన్న చూపు చూసాడు...అతనిమీద అతని కుటుంబం  మీదే కాదు...తన చిరునవ్వుతో రోజు స్పూర్తిని పంచే పలకరించే నాలాంటి యెంతో మంది మీద..

Monday, November 21, 2011

బొమ్మేనక బొమ్మ పెట్టి...అమెరికతలు-౧౨

ఈ రోజు టీవీ ౯ లో ఒక వార్త. ఝాన్సీ లక్ష్మి బాయి నిజంగా బ్రిటిష్ వారిపై యుద్ధం చెయ్యలేదని, అదంతా ఝాల్కారి బాయి అనే ఆమె ఝాన్సీ బాయి లా యుద్దానికి వెళ్లి,యుద్ధం చేసిందని.ఆమె నిమ్న వర్గాలకు చెందినది కావటం వలన, ఆమె పేరు అణగదొక్కి ఝాన్సీ బాయి కి గొప్ప పేరు రావటం వెనక ఉన్నత వర్గాల కుట్ర దాగి ఉంది అని ప్రస్తుత ముక్క చెక్కల పోలిటిక్స్ హీరోయిన్ మాయావతి ప్రభుత్వ ఉవాచ. త్వరలో లక్నో లో మాయావతి బొమ్మ పక్కన రోడ్డుకు అడ్డంగా ఝాల్కారి బాయి బొమ్మట్టేస్తామని వెనకబడ్డ బొమ్మల సముద్దరణ కి బ్రేసులేటు కట్టుకున్న ( ఈమె చాల మోడరన్ను) మేడం గారి శపధం.
సరే ఇదంతా నిజమే అనుకుందాం.పాపం శమించు గాక. నిజంగానే ఇదంతా నిజమనే అనుకుందాం. ఏవిదం గా చూసినా రత్న గర్భ అయిన ఈ దేశంలో, రక రకాల రాజ వంశాల కింద నలిగిన జనం ఎవరికి పట్టారు. రాజ భోగాలను భావించిన వీరు తమ తమ భోగాలను కాపాడు కోవటానికి సైనిక రాజ్యాలు ఏర్పాటు చేసారు కాని, సామాన్యుల సంగతి పట్టినది ఎందరికి.భారత్ రక రకాల సంస్తానల క్రింద మగ్గుతున్నప్పటికి ఆనాటి లెక్కల ప్రకారం క్రీస ౧ శతాబ్దం నుంచి ౧౮ వ శతాబ్దం వరకు ప్రపంచపు అతి పెద్ద ఆర్దిక వ్యవస్థ. అక్బర్ బొక్కసపు సంవచ్చరిక లెక్క పదహారు మిల్లియన్ పౌండ్లు.మరి రెండు వందల సంవచ్చారాల తర్వాత బ్రిటిష్ రాణి ఆదాయం పెదిహేడు మిలియన్లు.అంటే, ప్రపంచం పిక్కలతో లెక్కలు నేర్చుకునే కాలం నుంచి అప్రతిహతం గా భారత దేశం సుసంపన్నం.మరిన్ని వివరాలకు క్రింద లింక్ చూడండి.
http://en.wikipedia.org/wiki/Economic_history_of_India 

మరి ఈ కాలం లో జనం మంచిగా బ్రతికి ఉంటారు అనుకుంటున్నారా? ఇక్కడ జనం ఎప్పుడు ఒకేలా ఉన్నారు. ప్రతి రాజు తన రాజ్య కాంక్ష తో భోగలాలస తో ఆ పన్ను ఈ శిస్తు అని జనం నడ్డి విరిచేవాడే. హిందూ రాజుల మాట అటు పెడితే, ముస్లిం రాజులు జన హననాన్నే తమ ప్రధాన కార్యం చేసుకున్నారు. వారు దండెత్తి వచ్చిన ప్రతి సారి లక్షలాది మంది హిందువులను వధించేవారు.లేక బానిసలు గా తీసుకు వెళ్ళేవాళ్ళు.
http://en.wikipedia.org/wiki/Islamic_invasion_of_India
తమ మతమేదో తమది అన్నట్టు, పరాయి దేవాలయాలను నుగ్గు నుగ్గు చేసేవారు. స్వార్ద చింతనే పరమావదిగా మన రాజులు కొందరు పరాయి వారికి సహకరించడం మామూలే.మోఘలులనుంచి బ్రిటిష్ వారి దాక ప్రతి పరాయి వలసవాదులు దీనినే అలుసుగా తీసుకున్నారు.విభజించి పాలించడం వారి పద్దతి అని చదూకున్నా,మన బంగారం మంచిది ఐతే అనికూడా చదుకోవాలి కదా.
చారిత్రికంగా,భారత భూమి రక రకాల నదులతో ప్రతి సారి కనికరించే రుతుపవనాలతో అన్నపూర్ణ.తిండికి బట్టకు లోటు లేక పోవడం వల్లనే మన దేశం లో భాష, అమోఘమైన పద్దతి లో గణితం,భిన్నమైన రచనా సంగతులు,ఎన్నో గొప్ప గొప్ప కావ్యాలు రచించ బడ్డాయి. మరి ఇవన్ని సామాన్యులకు అందాయా అంటే, మన దేశపు వర్ణ వ్యవస్థ సమాజాన్ని రక రకాల ముక్కలు చేసి చదువు సంధ్య కొందరికే పరిమితం చేసింది.
మరి వీటన్నిటికి పై వార్త తో ఏమిటి సంబంధం అంటారా..బ్రిటిష్ వాళ్లతో యుద్ధం చేసిన ప్రతి రాజ్య వ్యవస్తా, తమ తమ స్వప్రయోజనాలను కాపాడుకోవటం కోసమే ప్రయత్నించాయి కాని,దేశ ఉమ్మడి ప్రయోజనాల గూర్చి కాదు.అందుకే చరిత్ర లో ఒకటి రెండు  చోట్ల తప్ప పూర్వ సంస్తానాదీసులు ఉమ్మడిగా తిరుగు బాటు చేసినట్టు తెలియదు.

తమ కంటి ని తామే పోడుచుకున్నట్టు, బ్రిటిష్ వ్యవస్థ అందించిన విద్యా వ్యాపార అవకాశాలను అంది పుచ్చుకున్న భారత యువతరం స్వతంత్ర పోరాటాన్ని మరో మలుపు తిప్పింది. గాంధీ,గోఖలే,బోసు,భగత్ లేనా...మరి మౌలానా ఆజాద్,ఇక్బాల్ లాంటి నేతలు ఇందులో ప్రాతఃస్మరణీయులు.విభిన్నము సుసంపన్నమైన భారత జాతికి మణి పూసలు. సరోజినీ,దుర్గా బాయి లాంటి అమ్మలు మహిళా శక్తి స్వరూపునులు .చతుర్వర్ణాలు కలిసి రావటం తో పాత సంస్తానాదీసులు కూడా జనం తో గొంతు కలపక తప్పలేదు.మరి అలాంటప్పుడు ఇల్లాంటి సంస్తానాలు గెలిచినా ఓడినా జనాలకు ఒరిగి ఉండేది ఏమి లేదు. ఇంకా వీళ్ళందరికీ బొమ్మలు పెట్టే సిమెంటు తో నాలుగు రోడ్ల లో గతుకులు పూడ్చినా జనం సుఖ పడతారు.
Winston Churchill … & his argument against granting India / Pakistan independence …
“Power will go to rascals, rogues, freebooters … All leaders will be of low caliber & men of straw … They’ll have sweet tongues & silly hearts …
They will fight amongst themselves for power & the two countries will be lost in political squabbles … A day would come when even air & water will be taxed.”

అరవై నాలుగేళ్ళ క్రితం చర్చిల్ మాటలు. కొందోకంచో నాకు ఒక వైపు నవ్వు మరో వైపు కోపం తెప్పించేవి. కాని ఇప్పుడు పరిస్తితి చుస్తే ఆయన చరిత్రలో  ఎందుకు గొప్ప వాడు అయ్యాడో తెలుస్తుంది. మరి ఇల్లాంటి నాయకుల నుంచి ఏమి ఆశిస్తారు. రోడ్ల కడ్డంగా మాయ అమ్మ,కాన్షి రాం ల బొమ్మలు, ఇంకా ఈ మాత్రం పరపీడన చరిత్ర లో పిడకల వేటలో పట్టు కొచ్చిన మరో నాలుగు బొమ్మలు పెడితే రేపు నాలుగు ముక్కలయ్యే రాష్ట్రం లో ఏదో రెండు ముక్కల్లో నైన గొర్రె జనం వోట్లేయ్యక పోతారా..తదాస్తు....