Tuesday, May 7, 2013

ఇండియన్ షేకు ... చైనా ఒంటె....


మంచి సందేశం ఉన్న కధ  ఇది. రాసిని వాసిని బట్టి చూస్తే అరబిక్ దేమో.  ఒక అరబ్బు షేకు దూర దేశం ప్రయాణ మవుతాడు. చిరకాలం పెంచుకున్న ఒంటె మీద. చీకటి పడటంతో ప్రయాణం మంచిది కాదని, ఎడారి మద్యలో గుడారం వేస్తాడు.

ఎడారి చలి. ఒంటె తట్టుకో లేక పోతుంది. కొద్దిగా మెడ లోపల పెట్టి, షేకు చలికి నా వొళ్ళంతా కొంకర్లు పోతుంది. కాని వొళ్ళంతా ఎలా ఉన్నా ఒక్క తల కాపాడుకుంటే, ఈ రాత్రి గట్టేక్కుతాను. కొంచెం తల లోపల పెట్టుకోవటానికి అనుమతి ఇవ్వండి.

షేకు ఆలోచించాడు. గుడారం పెద్దది. ఒంటె తల పెట్టుకుంటే, తన కేమి ఇబ్బంది లెద్దు. అల్లాగే జగిగింది. ఒక జాము గడిచింది. ఇదిగో, మళ్ళా ఒంటె ఒండ్ర పెట్టింది. షేకు షేకు ... నా శరీరంలో తల కన్నా ముఖ్యమైన భాగం నా మూపురం. నా ఒంట్లో కొవ్వంతా అక్కడే ఉంటుంది. కొంచెం దాన్ని కూడా లోన పెట్టుకోనిస్తే, మీకు రుణ పడి   ఉంటాను. షేక్కు అది సబబే అనిపించిన్ది.

అల్లా రెండు మూడు జాములు గడిచే కొద్దీ, ఒంటె గుడారాన్ని ఆక్రమించింది. షేకు వణుకుతూ చలి ఎడారిలో రాత్రి గడపాల్సి వచ్చింది.

చైనా ఆక్రమణ విషయం లో ఇండియా వ్యవహారం  అరబ్బు షేకు లాగే ఏడిచింది. నేడు 19 కీమీ లోనికొచ్చి వాళ్ళ డిమాండులు నెరవేర్చుకున్న చైనా, రేపు ఇంకో రెండు మైళ్ళు లోనికి రాదనీ , ఏ యాగి చేయ్యదంటే నమ్మలెము.

ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే చునార్ సెక్టార్ లో ఆక్రమణ రేఖ కు మనవైపున బంకర్లను మనమే నాశనం చేసుకుని లెంపలు వేసుకుని వెనక్కు తగ్గటం. రెండవ తరగతి పిల్లలకు కూడా అర్ధం కాని ఈ ఒప్పందం చేసుకుని మనోళ్ళు సాధించినది ఏమిటయ్యా అంటే, మీడియాలో తమ ప్రభుత్వ చేత కాని తనానికి ముసుగేసు కోవటం. ఘనత వహించిన మన మంత్రి వర్యులు చైనా పర్యటన, చైనా పెద్దాయన ఇండియా పర్యటన రద్దు కాకుండా, కాపాడుకోవటము.

మొదటి నుంచి మన విదేశాంగ విధానం తప్పుల తడకె. కాశ్మీరులో  మొదలుకొని కన్య  కుమారి దాక, రాన్ అఫ్ కచ్ నుంచి అరుణాచల  ప్రదేశ్ ఆవలి హద్దుల వరకు మన వెదవాయిత్వమ్ వెతకకనే కనపడుతుంది. టిబెట్ ఆపద్ధర్మ ప్రభుత్వానికి రాజధాని ని ఇచ్చిన మనం, టిబెట్ చైనా  లో భాగమని వోప్పేసుకుంటాం. అదే చైనా, సిక్కిం, అరుణాచల ప్రదేశ్ లను తన మాపు లో  కలిపెసుకుంటే కిమ్మనము.

బంగ్లా చొరబాట్లు ఈశాన్యం లో తల బొప్పి కట్టించినా మన వోటు బ్యాంకు రాజకీయాలకు వోట్లే తప్ప ప్రజల పాట్లు పట్టవు. మొన్న మొన్నటి సంఘటనే తీసుకుంటే, పోయిన భూమి ఎల్లాగు పోయింది. చైనా టెంట్ల ఎదురుగా మనము మన బలగాలను  పెంచు కుని, శత్రువు కళ్ళలో కళ్ళు పెట్టి చూసే ధైర్యం ఎందుకు చెయ్యలేక పొయాము. వాస్తవాధీన రేఖలను, అంతర్జాతీయ సరిహద్దులని  ఒప్పేసుకుంటే, సగం తలనొప్పులు తగ్గుతాయి. ఇలా వాళ్ళు రేఖలు ఉల్లంఘించినప్పుడు మీన  మేషాలు లెక్కించే పని ఉండదు.

మరి, మన భూమి నుంచి మనమే వెనక్కి తగ్గాల్సిన అవమానకర ఒప్పందం ఎందుకు చేసుకోవలసి వచ్చింది. ఏ రోజు కా రోజు పబ్బం గడుపుకునే రాజకీయులు అంత కంటే ఏమి ఆలొచిస్తారు.వీటన్నిటికీ వాళ్ళకు సమయం వుంటే కదా.. అయ్యా... ఎన్నికల సమయమ్.. అందరూ ప్రచారాల్లో బిజీ గా ఉన్నారు.. మీ చావు మీరు చావండి