Tuesday, December 24, 2013

మనమెరుగని రాజకీయం

ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం.
పట్టుమని వత్సరం పూర్తి  చేస్కోని పార్టీ ఒకటి, దిగ్గజాలను వూడ్చి పారేసింది.
ఇంకా చెప్పాలంటే, తమ పార్టీ గుర్తు ని సార్ధకం చేసింది. 
ఈ చెత్త నిర్మూలన కార్యక్రమం లో మహామహులెందరో మట్టి కరిసారు. 
ఇదంతా ఎలా జరిగింది. 
ఒక సారి మన రాష్ట్రాన్నే గమనిద్దాం. పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు జీవితం ఒక పోరాటం. చదవటానికి అడ్డదిడ్డంగా పెరిగిన ఫీజులు ఒక అడ్డంకి. ఎలాగోలా చదివొస్తే వుద్యోగం సాదించడం ఒక పోరాటం. ఏదో ఉద్యోగం వస్తే ఆ వచ్చే నాలుగు రాళ్ళతో జీవితం గడపటం ఒక పోరాటం. ఈ రోజు ఉన్న ధరలు రేపు ఉండవు. అదేమీ చిత్రమో ధరలు 200-300 శాతం పెరిగినా మన ప్రభుత్వాలకి చీమ కుట్టినట్టైన ఉండదు.

ఇవన్ని అలా ఉంటె మద్యలో ఎవరికీ ఉపయోగ పడని రాజకీయ దందా. ఎక్కడికైనా వెళ్ళాలంటే సరైన రోడ్లు ఉండవు. ట్రైన్లలో టికెట్లు దొరకవు. ఇంతెందుకు, దశాబ్దాల తర బడి దేశం స్వతంత్రం గానే ఉన్నా, జనాభాలో సగం మందికి పైగా పూట గడవని వాళ్ళే. ఇంకో పెద్ద వింత ఏమిటంటే, ప్రపంచం లో ఎక్కడా కన పడని మన రిజర్వేషన్ సిస్టం లో వ్యక్తి ఆర్ధిక స్తితికి ఎటువంటి స్తానం  లేకపోవటం. కులం మతం లేని దేశాన్ని స్తాపిస్తాం అని జబ్బలు జరుచుకునే మనం ఇంకా ఆ దిక్కుమాలిన బూజుపట్టిన భావజాలాన్నే  నెత్తి నెత్తుకొని సంబర పడటం.

మనకు అర్ధం కాలేదు కాని మన రాజకీయులు దీన్నేప్పుడో సూత్రీకరించి పడేశారు. రోటి కపడా మకాన్ అని. అంటే జనాలకు ఈ కనీస అవసరాలు అందకుండా చేస్తే, వాటిచుట్టూనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మన పనులు మనం చక్క పెట్టుకోవచ్చు అని.

ఇవన్నీ సమస్యలే. చాలా పెద్ద సమస్యలు. కాని కర్మ సిద్దాంతాన్ని నిలువెల్లా వంట బట్టించుకున్న ఈ దేశంలో ఈ దిక్కుమాలిన స్తితికి ఎవ్వరు కారణం కాదు. అదేంటో రాజకీయ  నాయకులు అవేవీ తమకు పట్టనట్టు తిరగటం సిగ్గు చేటు. అయ్యా ఒక ఆడపిల్ల  రాత్రి తిరగలేని పరిస్తితి అంటే, ఆ టైం లో తిరగటం ఎందుకు అని వ్రాక్కిచ్చిన ముఖ్యమంత్రులు, వందలాది మంది తీవ్రవాదుల బుల్లెట్లకు ఆహుతైతే, గంట గంటకూ సూట్లు మార్చి విలేఖర్ల సమావేశాలకు ముస్తాబయ్యే మంత్రులు, మన ప్రజాస్వామ్యం మనకిచ్చిన అమూల్య వరాలు.

ఇదంతా సరే... మరి ఇలాంటి వాళ్ళు కాకుండా మంచి వాళ్ళని ఎన్ను కోవచ్చు కదా.. అంటే,
మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రావటం మానేసి చాల కాలం అయ్యింది. ఈ రోజుల్లో రాజకీయం ముచ్చటైన వ్యాపారం. ఇదిగో, ఇలాంటి పరిస్తితుల్లో అన్నా హజారే అవినీతి వ్యతిరేక వుద్యమం , అరవింద్ లాంటి వాళ్ళు ఆయన వెంట నడవటం, దానికి ఢిల్లీ కేంద్ర స్తానం కావటం, ఆప్ పుట్టుక, జరిగిపొయాయి.

అన్ని రకాలు గ బ్రస్టు పట్టిన రాజకీయ చెద రంగం లో  ఒకే ఒక నిజాయితీ పరుడు, కొండకొంచో సేవా కాంక్ష ఉన్నవాడుగా అరవింద్ కనపడ్డాడు. ఇదంతా వన్ మాన్ షో అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, ఆయన పార్టీ అభ్యర్దులు కొంతమందిని మినహాయించి పక్కా నేలబారు వ్యక్తులె.

ఎడా పెడా పెరిగే ధరలు, విద్యుత్ ఛార్జ్, టైం పాడు లేకుండా రోడ్ల మీద రొద చేసే బాబు అమ్మలా కార్లు, ఎప్పుడో కాని రాని నీళ్ళు, దేశ  రాజధాని అయినా దిన దినం దిగజారుతున్న భద్రతా, ఇవన్నీ ఎవరు మాట్లాడని అంశాలే కావచ్చు. కాని అరవింద్ ఇవన్ని మేనిఫెస్టో లో ప్రకటించి నప్పుడు జనభాహుల్యాన్ని యిట్టె ఆకర్షించారు. ఇవన్ని మిగతా పార్టీలు పట్టించు కోక పోయి ఉండచ్చు. అవి వీటిని పట్టించు కున్నా జనం వారి మాటలు నమ్మటం మానేసి చాల కాలం అయ్యింది .

ఏది ఏమైనా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు నేటి రాజకీయానికి ఒక చెంప పెట్టు. మరో యుగానికి, ప్రజలు మెచ్చే, పనికి వచ్చే మేలు మలుపు.ఈ సమస్యలు దేశం నలు మూలలా ఉన్నవి. కాని ప్రతి రాష్ట్రం లో ఆప్ లాంటి ప్రత్యామ్యాయం లేదు. అలాంటి దేదో వచ్చేదాకా నేనైతే వోటింగ్ ఫర్ నన్ అఫ్ ది ఆబోవ్ ;)


No comments:

Post a Comment