Sunday, December 25, 2011

లోక్ ఫూల్-అమెరికతలు-౧౧

లోక్ ఫూల్ బిల్లు లో కొన్ని ముఖ్యాంశాలు :

౧.కేంద్రం లో లోక్ ఫూల్. రాష్ట్రం లో లోకా భుక్త. అక్కడ 9  మంది.అందరు మొదటి కేసు చూసేలోగా టపా కట్టేంత ముసలోళ్ళు( అనుభవజ్ఞులు అని చదువుకోండి పాపం).ఇందులో కూడా బ్యాక్ వార్డ్ రిజర్వేషన్ కింద 4 గురు. మత రిజర్వేషన్ కింద ఇద్దరు, అమ్మగారి రిజర్వేషన్ ఒకటి.యువ నేత రిజర్వేషన్ ఒకటి. మిగిలిన బూడిద జనాలకి.

౨.దీనికిన్డకు ప్రధాని వస్తాడు కాని, ఏవైతే ప్రభుత్వ శాఖలు ఆయన కిందకొస్తాయో వాటిలో ఆయనను విచారించకుండా ఎప్పటి కప్పుడు ఈ బిల్లు ని సవరించాలి.

౩. ఇంకా,ప్రధానిని విచారించాలంటే, మొత్తం లోక్ ఫూల్ సబ్యుల్లో మూడో వంతు మంది ఒకే రోజులో నలభై మైళ్ళు నడిచి సాయంత్రం అయిదు లోగా ప్రధాని ని ఆయన ఆఫీసు లో పట్టు కొని విచారించాలి, ఆ రోజు ప్రధాని దొరక పొతే, తర్వాత రోజు ఇదే పద్దతి లో ప్రయత్నించాలి. వారికి మూడే అవకాశాలు ఇవ్వబడతాయి. అప్పటికీ వారు ప్రధానిని విచారించలేక పొతే తర్వాత సంవత్చరం ప్రయత్నించాలి.

౪.అందరు ఉద్యోగులు లోక్ఫూల్ పరిది లోకి. కాని వారిని విచారించేది కే బీ సి. వారు మూడు ప్రశ్నలకు తప్పు సమాధానం ఇస్తే,వారు నిర్దోషులు గా ప్రకటించబడతారు.

౫. దీని సభ్యుల ఎంపికకు అన్వేషణ కమిటీని తీహార్ జైల్లో ఉన్న మంత్రులతో ఏర్పాటు చేస్తారు. కామన్ లూట్ పోటీలు, ౩ జీ స్కాం లో ఉన్న వారికి ప్రత్యెక రిజర్వేషన్.

౭. జీ బీ అయి లాంటి సంస్తలపై వీరికి ఎటు వంటి నియంత్రణ ఉండదు. అంతెందుకు, వీరి ఆఫీసు అద్దె కూడా వీరే కట్టుకోవాలి. కూర్చో డానికి కుర్చీలు బల్లలు తెచ్చుకోవాలి. లేకపోతే కింద కూర్చోవాలి.

౯. వీరు నేరం నిరూపిస్తే, నాలుగు గుంజీలు తీయాలి. ఒకేసారి తియ్యలేక పొతే రెండు మూడు విడతలు గా చెయ్యవచ్చు.కనిష్ట శిక్ష రెండు  గుంజీలు.

అన్ని పార్టీల మద్దతు కూడగట్టడానికి, బిల్లులో ఈ కింది మార్పులు చేయటానికి పరిశీలిస్తున్నట్టు న్యాయ  శాఖ మంత్రి ప్రకటించారు.

౧. అధికారం లో ఉన్న పార్టీ కి లోక్ ఫూల్ కమిటీలో యాభయి శాతం సీట్లు. మిగతావి సంకీర్ణ భాగస్వాములకు,ప్రతిపక్షానికి కేటాయించారు.ఈ దామషాలోనే మత ప్రాతిపదికన కూడ  రిజర్వేషన్లు అమలు జరపటానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు.అలాగే ఇందులో కుల ప్రాతిపదికన కూడ రిజర్వేషన్లు అమలు చెయ్యాలని దక్షిణాదికి చెందిన ఒక పార్టీ కోరింది.
౨. సంకీర్ణ భాగ స్వాములకు సంబందించిన పార్లమెంట్ సభ్యులకు ఇందులో మినహాయింపు కల్పిస్తారు. నల్ల కళ్ళజోడు పెట్టుకునే దక్షినాది నాయకులు వారి కుటుంబ సబ్యులను ఇందులో నుండి మినహాయించాలని ఒక పార్టీ సబ్యులు లోక్ సభలో భేటాయించి మరీ కోరారు.నల్ల కళ్ళజోడు అనే వాక్యాన్ని బిల్లు లో తప్పని సరి గా చేర్చాలని కోరారు.
౩. జీ బీ అయి కి ప్రతి గా వేరే దర్యాప్తు సంస్తను లోక్ ఫూల్ కింద ఏర్పాటు చేస్తారు. వారికి అధునాతనమైన పేము బెత్తాలు, కిర్రు చెప్పులు, ప్రభుత్వమే సమకూరుస్తుంది.
౪.గడ్డి సంబందిత వ్యవహారాలను ఇందులో నుండి మినహాయించాలని ఉత్తరాది కి చెందిన ఒక నాయకుని ప్రతిపాదన ను ప్రభుత్వం పరిశీలిస్తుంది.
౫. ఎటు వంటి నిరాహార దీక్షలు అనుమతించ రాదనీ దీనివల్ల ప్రజా జీవితానికి భంగం కలుగు తుందని, ఇటీవల కాలం లో బీహార్ వలస వాసులను ముంబై నుండి కొట్టి  తరిమేసిన ఒక పార్టీ ఘట్టిగా కోరింది.ఇదే పార్టీ బిల్లు మరాటి లోనే ఉండాలని మిగత వాళ్ళు కావాలంటే తర్జుమా చేసుకోవచ్చని ప్రకటించింది.
౬.ఒకవేళ ఈ బిల్లు అమలు అయిన పాత కేసులు పరిసీ లించరాదని తీహార్ జైలులో ప్రత్యేకంగా ఏర్పాటైన మంత్రుల కమిటీ కోరింది.

No comments:

Post a Comment