Friday, September 14, 2012

కరునామయులు…


మొన్నామధ్య మన కసాబ్ తీర్పు మీద అదేదో ఛానల్ లో చర్చా కార్యక్రమం. ఒకామె తెగగింజుకోవడం చూసాను.ఉరిశిక్ష వేస్తె, ఆయనకీ తను చేసిన తప్పు తెలియదట…శిక్ష పరివర్తన తేవాలి అని భాధ పడి పోయింది. ఇలాంటి వాళ్ళకు మన దేశం లో తక్కువేమీ లేదు. ఈవిడ ఇంట్లో వాళ్ళో బంధువులో ఆ దాడి లో పోయుంటే ఆమె ఇలా మాట్లాడేద?? సి.ఎస్.టీ లో జరిగిన మారణ హోమం, ప్లాట్ ఫోరం పైన అటు ఇటు చెల్లాచెదరైన మృతదేహాలు, ఎటు చుసిన రక్తం, తామెందుకు చనిపోతున్నమో తెలీక, ఏమి జరుగుతుందో తెలీక ప్రాణాలు విడిచిన ప్రజలు…పిల్లలు, మహిళలు, వ్రుద్దులని తేడాలేక జరిగిన దారుణం…మత పిచ్చి తో మదమెక్కిన మూకల నర మేధం…మీరు దేశభక్తి తో ఆలోచించక పోయినా మానవత్వకోణం లో నైన హృదయ విదారకం.
నారిమన్ హౌస్ లో అమాయకుల ఊచకోత, తాజ్ ముట్టడి ఇవన్ని ఎలా మర్చి పోతారు. సలస్కర్, ఆమ్టే, ఉన్నికృష్ణన్  లాంటి వీరుల బలిదానం, మనమెలా మర్చి పోగలం. మరి వీటన్ని టికి కారణం అయిన వాళ్ళను వదిలెయ్యాలా…
నారిమన్ హౌస్, తాజ్, మరి ఇతర చోట్ల జరిగిన సంఘటనలు ఈ దేశం ఉగ్రవాదులకు యెంత సాఫ్ట్ కార్నెర్ గా మారిందో చెప్పకనే చెప్తున్నాయి. మరి దొరికిన వాడిని కూడా క్షమాభిక్ష లేక పరివ్వర్తన అని వదిలేస్తే, రేపు ఈ ఇలాంటి సంఘటనలు రొజూ జరగోచ్చు. ఇంత జరిగిన మన ఘనత వహించిన న్యాయ వ్యవస్థ కసాబ్ గారికి ఎన్నో బంపర్ ఆఫేర్లు ఇస్తోంది…ఆయన మల్ల supreme కోర్ట్ కి వెళ్ళచ్చు. అక్కడా అదే తీర్పు వస్తే రాష్ట్రపతి క్షమా భిక్ష అడగడానికి ఇలాంటి తిక్క జనానికి మన దేశం లో కొదువ లేదు.
౧౬౧ మంది మరణానికి కారణమైన ఒక కిరాతక ఉగ్రవాదిని ఉరి తియ్యాలి అని డిసైడ్ కావటానికి మనకి ఇన్ని రోజులు పట్టింది. ఐన అది జరుగుతుందో లేదో తెలీదు.ఇలాంటి మానవతా వాదులు కరునామయులు ఉన్న దేశం లో యెంత మంది కసాబ్ లు లాడెన్ లు వచ్చిన మనం వాళ్ళను పరివర్తన చేసి పంపాలి కాని… అనే నసిగే జనాలను ముందు ఉరి తీయ్యాలి. ఇలాంటి  విషయం లో నైన మనం ఐక్యత చూపక పొతే రేపు ఈ సంఘటన మీ వీదిలో మీ ఇంట్లో జరగోచ్చు…అప్పుడు ఆలోచించ డానికి, ఆరోపించడానికి ఏమి మిగలదు…

No comments:

Post a Comment